మోదీ అహంకారం దేశానికి చేటు

మోదీ అహంకారం  దేశానికి చేటు

న్యూ ఢిల్లీ : రాజ్యసభలో విపక్షానికి చెందిన ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ప్రజాస్వామ్యం గొంతును కేంద్రం నొక్కేస్తోందని తీవ్రంగా మండి పడ్డారు. ముసాయిదాల్ని ప్రవేశపెట్టే ముందు రైతులను సంప్రదించలేదు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు.పార్లమెంట్ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ప్రభుత్వ దురహంకారానికి ప్రతీక. భారత ప్రజాస్వామ్య గొంతును నొక్కేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదట సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రైతు వ్యతిరేక చట్టాల్ని తీసుకొచ్చారు. మోదీ అహంకారం వల్లే దేశానికి ఆర్థిక విపత్తు వచ్చి పడింద’ని ట్విట్టర్ లో రాహుల్ మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos