వారు అగ్నివీరులా? కులం వీరులా?

వారు అగ్నివీరులా? కులం వీరులా?

న్యూ ఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రస్తుత ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అగ్నిపథ్ నియామకాలను అదే విధంగా చేపడుతోంద ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటార న్నారు. సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కుల పత్రం ఎందుకని ప్రశ్నించారు. కులాల ద్వారానే వ్యక్తుల దేశభక్తి గుర్తిస్తారా అని భాజపా ఎంపీ వరణ్ గాంధీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీని గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. “చరిత్రలో తొలిసారిగా సైనిక నియామకాల్లో కుల, మతాల గురించి ప్రస్తావన వచ్చింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు మోదీ సైన్యంలో అవకాశం ఇవ్వరా? మోదీ ప్రభుత్వం అసలు రూపం ఇప్పుడు బయటపడింది. మోదీ జీ మీరు అగ్నివీరులను చేస్తారా లేక జాతివీరులనా?” అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos