తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పొరుగు సేవల సిబ్బంది బుధవారం ఇక్కడ ఆందోళనకు దిగారు. తమను రాష్ట్ర పొరుగు సేవల సిబ్బంది సంస్థలో విలీనం చేయాలనే తితిదే పాలకమండలి నిర్ణయానికి నిరసనగా తితిదే పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. భౌతిక దూరాన్ని పాటించి ఆందోళన కొనసాగించారు. పాలక మండలి నిర్ణయం తమ ప్రయోజనాలపై గొడ్డలి వేటని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.