అన్నా డీఎంకేలో మిన్నంటిన సంబరాలు

అన్నా డీఎంకేలో మిన్నంటిన సంబరాలు

హొసూరు : రాష్ట్రంలో రెండు శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకే అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హొసూరులో అన్నా డీఎంకే కృష్ణగిరి దక్షిణ విభాగపు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలకృషారెడ్డి, పార్టీ నాయకులు హొసూరు-బాగలూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం సమీపంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలకృషారెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి యడపాడి పళనిస్వామి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని రెండు నియోజకవర్గాలలో ప్రజలు అన్నా డీఎంకేకు పట్టం కట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు త్యాగరాజ రెడ్డి, జయరాం, నారాయణ హరీశ్ రెడ్డి, ప్రభాకర రెడ్డి, కృష్ణారెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కాగా విక్రవాండి, నాంగనేరి నియోజక వర్గాలకు మూడు రోజుల కిందట ఎన్నికలు జరుగగా, గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

తాజా సమాచారం