దేశాన్ని అమ్మేస్తున్న మోదీ

దేశాన్ని అమ్మేస్తున్న మోదీ

న్యూ ఢిల్లీ : ‘త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఈ బడ్జెట్ ద్వారా వారి ఓట్లకు మార్గం వేసుకున్నార’ని లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. డబ్బును ఖర్చు చేయడం గురించి కేంద్ర మాట్లాడుతోందని, కానీ తాము ఎలాంటి నిధుల్ని అందుకోలేదని ఎద్దేవా చేశారు. పేద ప్రజల ఖాతాల్లో డబ్బులు జమచేసి, వారికి చేయూతనిస్తారని తాము ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని మండి పడ్డారు. పెట్టుబడులు పెట్టడం, ప్రైవేటీకరణతో దేశాన్ని అమ్మేయాలని కేంద్రం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. నేటి పరిస్థితులకు అనుగుణమైన బడ్జెట్ను ప్రవేశపెడుతుందని తాము ఆశించామని, కానీ అతి సాధారణమైన బడ్జెట్టే అని అధీర్ ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos