ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు

ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు

ముర్షీదా బాద్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డను ఉపయోగించు కుంటున్నారని లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి సోమవారం ఇక్కడ ఆరోపించారు. అమెరికాలో స్ధిరపడిన అనేక మంది గుజరాతీల ఓట్లను ఆకర్షించడమే ట్రంప్ పర్యటన ఆశయమని ఆరోపించారు. గతంలో వచ్చిన అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కలిసేవారు. ఈ సారి అలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడాన్ని తప్పుబ ట్టారు. ట్రంప్ పర్యటన వల్ల భారత్కు ఏమి ఒరుగుతుందని ప్రశ్నించారు. దీనిపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. ట్రంప్ని సంతోషపరచడం కోసమే ప్రధాని మోదీ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్య క్షుడు రాముడేమీ కాదు. ఆయన కోసం అంత వెచ్చించడం దేనికని ప్రశ్నించారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవ్వబోయే విందుకు పలువురు నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి అధిర్ రంజన్ చౌధురికి కూడా ఆహ్వానం అందింది. అయితే దీనికి తాను హాజరు కాబోనని అధిర్ రంజన్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించకపోవడమే అందుకు కారణమని వివరించారు. ట్రంప్, ఆయన భార్య సతీమణి మెలనియా, కూతరు-అల్లుడు ఇవాంకా ట్రంప్, జేర్డ్ కుష్నర్ సహా పలువురు ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos