తెలుగులో డబ్బింగ్ చెప్పిన మరో ముంబై భామ

తెలుగులో డబ్బింగ్ చెప్పిన మరో ముంబై భామ

హైదరాబాదు : మరో కథానాయిక ఆదాశర్మ తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. నూతన దర్శకుడు విప్ర దర్శకత్వంలో ఆదాశర్మ కథానాయికగా ‘?’ (క్వశ్చన్ మార్క్) పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘మన పాత్రకు మనం డబ్బింగ్ చెప్పుకుంటేనే దానికి సంపూర్ణత్వం వస్తుంది. అందుకే, ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. భాష సరిగా అర్థమైతే డబ్బింగ్ మంచి ఎక్స్ ప్రెషన్స్ తో చెప్పచ్చు. నాకు తెలుగు బాగా వచ్చేసింది. అందుకే, ఒక రోజులోనే డబ్బింగ్ పూర్తి చేసేశాను’ అని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos