అచ్చెన్నాయుడికి బెయిల్‌

అచ్చెన్నాయుడికి బెయిల్‌

అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం లో నిందితుడు తెదేపా నేత అచ్చెన్నాయుడుకు ఉన్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్ష విధించింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో రూ.150 కోట్ల వరకూ అవకతవకలు జరిగాయనే ఆరోపణపై అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు గత జూన్ 12న ఆయన స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మంది పై కేసులు దాఖలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos