చిక్కబళ్లాపుర వద్ద 11 మంది మృతి

చిక్కబళ్లాపుర వద్ద 11 మంది మృతి

చిక్కబళ్లాపుర: పట్టణ శివార్లలో బుధవారం ప్రైవేటు బస్సు, చిన్న లారీ ఢీ కొనటంతో 11 మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చింత మణి నుంచి బెంగళూరుకు వెళున్న బస్సు , చింతామణి నుంచి మురుగమల్ల కు పోతున్న చిన్న లారీ ఢీ కొన్నాయి. ప్రైవేటు బస్సు అతి వేగంగా ప్రయాణించటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.మృతులందరూ మురుగమల్ల ప్రాంతానికి చెందిన వారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఫరారాయ్యడు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos