ఆ అగ్నిప్రమాదం ఒక కుట్ర

ఆ అగ్నిప్రమాదం ఒక కుట్ర

హైదరాబాదు: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఒక కుట్ర అని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రేవంత్రెడ్డి శుక్రవారం ఇక్కడ అనుమానించారు. ‘అది ప్రమాదం కాదేమో. కుట్రని అనుమానంగా ఉంది. తాజా పరిణామం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందేమోన’న్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ జల దోపిడీకి సహకరించి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాల’ని డిమాండ్ చేశారు. నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆరు సొరంగాల్లో నాలుగు పేలిపోయాయి. విధుల్లో ఉన్న 12 మంది కార్మికుల్లో ఆరుగురు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం