అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడు, తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరుకు న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. ఈ కేసులోని ఇతర నిందితుల అన్ని బెయిల్ వినతుల్నీ నిరాకరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పని చేసినపుడు డొల్ల కంపెనీల నుంచి పరికరాల కొని అవక తవకలు, అవినీతికి పాల్పడినట్లు అభిమోగాలు నమోదైన విషయం తెలిసిందే.సుమారు రూ.150 కోట్ల అవినీతిలో తలసరి వాటాల సమాచారానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఆయనకు బెయిల్ మంజూరుకు కోర్టు తిరస్కరించింది