అమరావతి: ‘ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం లోపల పచ్చచొక్కా తొడుక్కున్న తెదేపా కార్యకర్త. బాబు, లోకే శ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండి య న్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని వైకా పా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోమవారం ట్విట్టర్లోఆరోపించారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు వైకాపాను బలహీనపరిచేందుకే నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసారు. ఫోన్ ట్యాపింగ్ మాఫియాను నడిపారని వైకాపా నేతలు విమర్శించిన విషయం తెలిసిందే.