కార్తీ విదేశయానానికి అనుమతి

కార్తీ విదేశయానానికి అనుమతి

న్యూఢిల్లీ: అనేక క్రిమినల్ కేసుల్లో ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ విదేశీ పయనానికి మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఆకు పచ్చ జెండా ఊపింది. ఈ నెల్లో అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి లభించింది.దీని ప్రకారం అత్యున్నత న్యాయస్థానం ప్రధాన కార్యదర్శి వద్ద రూ. 10 కోట్ల నగదును ధరావత్తు చేయాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి అటే ఫరారు కాబోనని, విచారణ సంస్థలకు సహకరిస్తానని న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని దాఖలు చేయాలి., చిదంబరం, కార్తీలను ఎయ్ర్సెల్-మ్యాక్సిస్ కేసుల్లో మే 30 వరకు అరెస్ట్ చేయరాదని ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos