కేజ్రీవాల్‌ ఇంటికి ఆప్‌ ఎమ్మెల్యేలు

కేజ్రీవాల్‌ ఇంటికి ఆప్‌ ఎమ్మెల్యేలు

న్యూ ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్తో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కేజ్రీవాల్ ఇంటికి క్యూ కట్టారు. మంగళవారం మధ్యాహ్నం సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోట్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా కేజ్రీ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో పాలన, తమ సుప్రిమో అరెస్ట్ తర్వాత నెలకొన్న పరిస్థితులు, రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి అంశాలపై వీరంతా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలంతా కేజ్రీ ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos