గుజరాత్​పై ఆప్​ గురి- అన్ని స్థానాల్లో పోటీ

గుజరాత్​పై ఆప్​ గురి- అన్ని స్థానాల్లో పోటీ

న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్లకు సరైన ప్రత్యామ్నాయం ఆప్ అని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్లో సోమవారం పార్టీ కార్యా లయ ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. ‘దిల్లీలో విద్యుత్ ఉచితంగా ఇస్తుంటే గుజరాత్లో మాత్రం ఎందుకివ్వరని ఇక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. 70ఏళ్లలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. కానీ మార్పు ఇప్పుడు మొదలవుతుంద’న్నారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం