పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ చట్టానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాన్ని ప్రారంభించారు. వివక్షకు గురవుతూ భారత్ కు వచ్చిన శరణార్థులకు సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం ఇస్తాం. అంతేగానీ, ఎవరి పౌరసత్వాన్నీ తీసేయడం లేదు‘ అని ఆయన నరేంద్ర మోదీ.ఇన్ లో పేర్కొన్నారు.#IndiaSupportsCAA హ్యాష్ ట్యాగ్ తో ప్రజలు ఈ చట్టానికి మద్దతు తెలపాలని మోదీ కోరారు. ప్రజలకు ఈ చట్టంపై ఉన్న అభిప్రాయాలను షేర్ చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఈ హ్యాష్ టాగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వేలాది మంది ట్వీట్లు చేశారు.