తిరుమల : కరోనా కేసులు పెరుగుతున్నందున తిరుమలను వ్యాధి పీడిత ప్రాంతంగా ప్రకటించారు.అయినా ఆలయం తెరిచే ఉంటుందని వివరించారు. లాక్డౌన్ తర్వాత ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తుల ప్రవేశానికే ఆలయ పాలక మండలి అనుమతించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 12,000 మందికి పెంచింది.