న్యూ ఢిల్లీ: మాజీ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లాకు మంగళ వారం గృహ నిర్బంధం నుంచి విముక్తి కలిగింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా, మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితర నేతలకు గృహనిర్బంధం విధించారు. ఇటీవలే ఫరూక్ అబ్దుల్లాలను కేంద్రం గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తి వేసొనట్లు జమ్మూ-కశ్మీర్ ముఖ్య సెక్రటరీ (ప్రణాళిక విభాగం) రోహిత్ కన్సాల్ ప్రకటించారు.