తెలుగు చిత్ర పరిశ్రమలో రాజేంద్రప్రసాద్ అనంతరం పూర్తిస్థాయి హాస్యచిత్రాలతో కామెడి హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్ కెరీర్లో చాలా వరకు విజయాలే ఎక్కువగా ఉన్నాయి.చాలా వేగంగా 50 చిత్రాలు పూర్తి చేసుకున్నా కొద్ది కాలంగా వరుస పరాజయాలు ఎదురవుతుండడంతో కొద్ది కాలంగా అల్లరి నరేశ్ జోరు కాస్త తగ్గింది. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ సినిమాల సంఖ్యను తగ్గించాడు.ప్రస్తుతం అల్లరి నరేశ్ నటిస్తున్న ‘బంగారు బుల్లోడు‘ చిత్రం చిత్రీకరణ ముగింపు దశకి చేరుకోవడంతో తుదపరి చిత్రంపై దృష్టి సారించాడు.దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. కెరియర్ పరంగా ‘అల్లరి నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు..