టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానుల కోసం చిత్రంలో మహేశ్బాబు పరిచయ సన్నివేశం టీజర్ను విడుదల చేసింది.సైన్యం దుస్తుల్లో మహేశ్బాబును పరచియం చేస్తూ అలా నడిచి వస్తున్న సన్నివేశం టీజర్కు హైలైట్గా నిలిచింది. మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ అంటూ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆర్మీ మేయర్ లుక్లో మహేశ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్ బిట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో మహేశ్బాబు సైనికాధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా చాలా ఏళ్ల విరామం అనంతరం విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది..