శిఖర్‌ ధావన్‌ స్థానంలో పంత్‌కు చోటు

  • In Sports
  • June 12, 2019
  • 272 Views
శిఖర్‌ ధావన్‌ స్థానంలో పంత్‌కు చోటు

ముంబై : ప్రపంచ కప్పులో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌కు అవకాశం దక్కినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ధావన్‌ బొటన వేలికి గాయమవడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇండియా గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆలోగా ధావన్‌ స్థానంలోని ఆటగాడు అక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే రిషభ్‌కు పిలుపు అందినట్లు సమాచారం. వెంటనే ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సిందిగా అతనికి సూచించామని బీసీసీఐ అధికారి చెప్పారు. అయితే పంత్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos