పని చేసే కార్యకర్తలకుగుర్తింపు:బాబు

పని చేసే కార్యకర్తలకుగుర్తింపు:బాబు

అమరావతి:  రాష్ట్రంలో 80 శాతం మంది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు .శుక్రవారం ఇక్కడ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దారుణంగా మాట్లాడుతూ రాష్ట్రానికి తగిలిన గాయంపై కారం చల్లుతున్నారని  మండిపడ్డారు. మోదీ మోసాన్ని ఎంపీ జయదేవ్ సూటిగా ఎండగట్టగలిగారనిప్రశంసించారు.వాస్తవాలకు దగ్గరగా ఎన్నికలకు వెళ్తున్నామని చంద్రబాబు నేతలకు వివరించారు. మనం శాశ్వతంగా అధికారంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని.. అయినా అంతా పార్టీకి విశ్వాసం గా ఉండాలన్నారు. అందరికీ న్యాయం చేయగలగాలని.. చివరి కార్యకర్త వరకూ న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాగద్వేషాలకు అతీతంగా టికెట్లు

పని చేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని.. సాధారణ కార్యకర్త అయిన షరీఫ్ మండలి ఛైర్మన్ కావడమే దీనికి నిదర్శనమని వెల్లడించారు.  రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని, సరైన వ్యక్తులకే టికెట్లు ఇస్తానని  స్పష్టం చేశారు.ఇబ్బంది ఉంటే ఉండవచ్చు..పార్టీనే సుప్రీం అని గుర్తుంచుకోవాలని నిర్దేశించారు.   పార్టీ కోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారు.వాస్తవాలకు దగ్గరగా ఎన్నికలకు వెళ్తున్నామని వివరించారు.”మనం శాశ్వతంగా అధికారంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని” శ్రేణులను కోరారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని..అందరూ  అంతా పార్టీకి విశ్వాసం గా ఉండాలని విన్నవించారు. అందరికీ న్యాయం చేయగలగాలని.. చివరి కార్యకర్త వరకూ న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు
భరోసా ఇచ్చారు. పార్టీ ద్వారానే హోదా వచ్చిందని మంత్రులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షకు అందరినీ తీసుకెళ్లే బాధ్యత ముగ్గురు మంత్రుల కమిటీదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని దీక్షను విజయవంతం చేయాలని మంత్రి కాల్వశ్రీనివాసులును ఆదేశించారు. దీక్షకు ప్రతిపక్షాలనూ ఆహ్వానించాలన్నారు. ఒక వేళ ప్రతిపక్షాలు రాకపోతే ప్రజలేతీర్మానిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. బందరు ఓడరేవు పనుల శంకుస్థాపన ఒక చరిత్ర అని అభివర్ణించారు. . దశాబ్దాల కలను నిజం చేస్తున్నామన్నారు. కౌన్సిల్ చైర్మన్‌గా షరీఫ్‌ బాధ్యతలు చారిత్రక ఘట్టమని అన్నారు. బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ చేశామని, ప్రతిభా భారతిని
అసెంబ్లీ స్పీకర్ చేశామని  గుర్తు చేశారు. సామాజిక న్యాయమే టీడీపీ మూల సూత్రమని వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు ఇస్తున్నామన్నారు. కులాల పేరుతో ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos