కృష్ణగిరి జిల్లాలో ఏడు మందికి కరోనా

కృష్ణగిరి జిల్లాలో  ఏడు మందికి కరోనా

హోసూరు : కృష్ణగిరి జిల్లాలో కొత్తగా ఏడు మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. హోసూరు, సూలగిరిలలో 20 మందికి కరోనా సోకగా, చికిత్సల అనంతరం వారు పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. వారం రోజులు గడవక ముందే మరో ఏడు మంది కరోనా బారిన పడడం జిల్లాలో కలకలం సృష్టించింది. కృష్ణగిరి జిల్లాలోని ఊతంగరైలో ఒకరికి కరోనా వైరస్ సోకగా ,కృష్ణగిరి సనీపంలోని కావేరి పట్నంలో మరో వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. కృష్ణగిరి సమీపంలోని బందారుపల్లి గ్రామానికి చెందిన మరో మహిళకు, హోసూరు ప్రభుత్వాస్పత్రిలో సేవియర్ గా పనిచేస్తున్న మహిళతో పాటు నలుగురికి కరోనా సోకింది. వారంతా కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల కిందట 20 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో కృష్ణగిరి జిల్లా గ్రీన్ జోన్ గా మారిందని అందరూ సంతోషించారు. అయితే ఆ ఆనందం అట్టే నిలవలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos