36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం, స్పీకర్ పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామా సాగరంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల ఎన్టీఆర్ సాగర్‌లో బోటులో విహరించారు. అనంతరం చెరువు పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి, మంత్రి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos