భారత్ కు రానున్న మరో మూడు రాఫెల్ యుద్ధవిమానాలు..

భారత్ కు రానున్న మరో మూడు రాఫెల్ యుద్ధవిమానాలు..

భారత వాయుసేనను మరింత బలోపేతం చేయడానికి ఈ నెల 4 వ తేదీన మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చెరోకునున్నాయి.ఇప్పటికే మొదటి బ్యాచ్ లో వచ్చిన ఐదు యుద్ధ విమానాలు సరిహద్దుల్లో గర్జిస్తుండగా రెండో బ్యాచ్ లో రేపు చేరుకోనున్న మరో మూడు యుద్ధ విమానాలు భారత వాయుసేనకు అదనపు బలంగా మారనున్నాయి.ఈ మూడు రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌లోని ఇస్‌ట్రెస్ నుంచి నేరుగా భార‌త్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు రానున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే ఫ్రాన్స్ నుంచి ఈ రాఫేల్ యుద్ధ విమానాలు సుమారు 8 గంట‌ల పాటు నాన్ స్టాప్‌గా ప్ర‌యాణించ‌నున్నాయి. ఈ విమానాల‌కు ఫ్రాన్స్ వాయుసేన‌కు చెందిన విమానం ఇంధ‌నం నింప‌నుంది. ఈ మేరకు భారత వాయుసేన గతనెలలో యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్‌ కు పంపిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos