నేడు రెండో వన్డే

  • In Sports
  • March 4, 2019
  • 210 Views
నేడు రెండో వన్డే

నాగపూర్ : భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే నాగపూర్‌లో మంగళవారం జరుగనుంది. అయిదు వన్డేల సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు రెండో వన్డే ప్రారంభం కానుండగా, ఈ స్టేడియంలో భారత్‌ రికార్డు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. 2017 అక్టోబరులో ఇండియా, ఆస్ట్రేలియాతో చివరి వన్డే ఆడింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 109 బంతుల్లో 125 పరుగులు చేశాడు. అతనికి మ్యాన్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ లభించగా, ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 2009 నుంచి నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో భారత్‌ ఒకసారి కూడా ఓడిపోలేదు. శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos