295 హామీల్ని అమలు చేశాం:బాబు

295 హామీల్ని అమలు చేశాం:బాబు

తెలుగుదేశం ప్రభుత్వం 295  హామీలు అమలు చేసిందని, ఇచ్చిన హామీల కన్నా అధికంగా నెరవేర్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజన్ 2029 డాక్యుమెంట్ ను విధానసభాపతి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనేది, 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలనేది తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. నిర్దిష్ట ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగల్గుతామని, తాను తొలిసారి సీఎం అయినపుడే విజన్ 2020 తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. విజన్ 2020 వల్ల హైదరాబాద్ లో అద్భుత అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఏపీలో కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర వృద్ధికి కృషి చేస్తున్నామని, ‘హ్యాపీనెస్’ గురించి మాట్లాడుతున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos