కొద్ది రోజుల క్రితం యూకేలో తప్పిపోయిన తనయుడి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.హైదరాబాద్లోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదవిన ఉదయ్ ప్రతాప్ తనయుడు శ్రీహర్ష లండన్లోని క్వీన్మేరీ యూనివర్శిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. మరికొద్ది రోజుల్లోనే యూనివర్సిటీ నుంచి ఎంఎస్ విద్య పూర్తయిన ధృవపత్రాలు తీసుకుని తిరిగి వస్తానని ఈనెల 21న లండన్ నుంచి ఖమ్మంలోని తన తల్లి, హైదరాబాద్ నగరంలోని చెల్లి ఐశ్వర్యతో ఫోన్ చేసి మాట్లాడారు.అప్పటి నుంచి శ్రీహర్ష ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన లండన్ పోలీసులు.. శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని ఉదయ్ ప్రతాప్కు ఫోన్ చేసి విషయం చెప్పారు.లండన్లోని ఓ బీచ్ వద్ద శ్రీహర్ష బ్యాగు దొరికిందని తెలిపారు.ధృవపత్రాలు తీసుకుని తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న శ్రీహర్ష కుటుంబసభ్యులకు.. మిస్సింగ్ అంటూ ఫోన్ రావడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కొడుకు ఆచూకీ తెలియరాలేదంటూ ప్రతాప్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.శ్రీహర్షకు.. సైంటిస్ట్ కావాలనేది లక్ష్యమని తెలిపారు. కాగా, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి శ్రీహర్ష మిస్సింగ్ విషయం తెలియడంతో ప్రతాప్కు ఫోన్ చేసి మాట్లాడారు. తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు..