వైసీపీలో సీనియర్ బొత్స సత్యనారాయణ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఆయన ఈ ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? బొత్స కుటుంబంకు జగన్ ఎన్ని టికెట్లు ఇస్తారు..? అసలు బొత్స ఎంపీగా పోటీచేస్తారా..? లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనే విషయంపై గత కొద్దిరోజులుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొత్స సత్యనారాయణ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. అంతటితో ఆగని ఆయన వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై బొత్స జోస్యం చెప్పారు.ఈ ఎన్నికల్లో వందకు పైగానే..పవన్ కల్యాణ్ లాంటి అమాయకుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. వైసీపీకి 2019 ఎన్నికల్లో కచ్చితంగా 100 సీట్లకు పైగానే వస్తాయని బొత్స జోస్యం చెప్పారు. ఏపీలో హంగ్ వచ్చే అవకాశమే లేదని.. వైఎస్ జగన్ పూర్తి మెజార్టీతోనే సీఎం అవుతారని వైసీపీ నేత చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తమ పార్టీ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు’ను గుళకరాళ్లన్న టీడీపీ.. ఇప్పుడు వాటినే కాపీ కొడుతోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మేం ఆనందపడ్డామన్నారు. చంద్రబాబు మాకు శత్రువు.. ఆయన ఓడిపోతే మాకు ఆనందం ఉండదా..? అని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా..!చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయమని తనను వైఎస్ జగన్ అడిగారన్నది కుట్రపూరిత ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. తానెప్పుడూ ఇన్ని టికెట్లు కావాలని అధిష్టానాన్ని అడగలేదlని బొత్స చెప్పుకొచ్చారు.