రూ.పది వేల కోట్ల విడుదల

రూ.పది వేల కోట్ల విడుదల

అమరావతి:రాష్ట్రానికి మరో రూ.పది వేల కోట్లు నిధులు యుద్ధ ప్రాతి పదికన విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని భాజపా నేత సోమూ వీర్రాజు తెలిపారు. కేంద్రం అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తోందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘తెదేపా నేత చంద్రబాబు గత ఐదేళ్లుగా భాజపాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కేంద్రాన్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదానే అయితే, దాన్ని కేంద్రం పరిశీలిస్తుంద’ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం సాగునీటిపథకం నిర్మాణానికి రూ.3,700 కోట్లు విడుదల చేసిందనన్నారు. పలువుతు తెదేపా నేతలు భాజపాలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos