జామియా అల్లర్లలో 10మంది అరెస్టు

జామియా అల్లర్లలో 10మంది అరెస్టు

న్యూఢిల్లీ: ఇక్కడి జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వ విద్యాలయంలో గత ఆదివారం హింసాత్మక ఘర్షణల పాల్పడ్డారనే ఆరోపణపై ఓఖ్లా ప్రాంతాల్లో 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ తెలిపారు. నిందితుల్లో విద్యార్థులెవరూ లేరని తెలిపారు. నిందితులంతా గతంలో నేరాలకు పాల్పడినవారని వివరించారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం విశ్వ విద్యాలయం విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తొలుత కొందరు దుండగులు నాలుగు బస్సులకు నిప్పంటించారు. పోలీసులతోనూ ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos