స్వదేశానికి పాక్ రాయబారి

స్వదేశానికి పాక్ రాయబారి

న్యూఢిల్లీ :  పుల్వామా దాడి నేపథ్యంలో సంప్రదింపుల నిమిత్తం మన దేశంలోని  రాయబారిని ఇస్లామాబాద్‌కు దాయాది దేశం పాక్‌ సోమవారం పిలిపించుకుంది. ‘మేము సంప్రదింపుల కోసం భారత్‌లోని మా రాయబారిని తిరిగి పిలిచాం. ఆయన ఢిల్లీ నుంచి బయలు దేరారు’ అని పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిథి మహ్మద్‌ ఫైసల్‌  ట్వీట్‌ చేశారు. ఈ ఘటనకు నిరసనగా పాకిస్తాన్‌ హైకమిషనర్‌ సోహైల్‌ను భారత్‌ విదేశాంగశాఖ ఉన్నతాధికార్లు తమ కార్యాలయనికి పిలిపించి  ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదులకు పాక్‌ అండదండలందిస్తున్నందుకు ఆక్షేపించారు.  జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని, తీవ్రవాదంతో సంబంధం ఉన్న పాక్‌ గ్రూపులు లేదా వ్యక్తులను నిలువరించాలని భారత ప్రభుత్వం హెచ్చరించినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos