అమృత్సర్: పాక్ చెరలోని భారత వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వాఘా-అట్టారి సరిహద్దు చేరుకున్నారు. జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ సైన్యం ఆయనను వాఘా సరిహద్దు వద్ద అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించనుంది. ఆయనకు వైమానిక దళ ఉన్నతాధికారులు వాఘా వద్ద ఘనస్వాగతం పలికారు. అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొంటున్నారు. వాఘా సరిహద్దు జైహింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగుతోంది. అభినందన్కు వైద్య పరీక్షలు జరిపిన తర్వాత దిల్లీకి తరలించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి