శ్రీనగర్: జమ్ము-కశ్మీర్లో
కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య హోరా
హోరీ కాల్పులు సంభవించాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు సైన్యానికి పట్టుబడినట్లు సమాచారం. ఇతర ఉగ్ర వాదుల కోసం సోదాలు సాగుతున్నాయి. పాక్ శుక్రవారం కూడా కాల్పులకు పాల్పడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. యురి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా ఒక పౌరుడు గాయపడ్డారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం తగిన
రీతిలో తిప్పికొడుతోంది.