దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ ఎవరనేది నేడు తేలనుంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే అత్యున్నత స్థాయి కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఈ కమిటీలో మోదీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఈ పదవికి 1982 నుంచి 1985 వరకు గల బ్యాచ్ల ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు పలువురు ఉన్నతాధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి.
దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ ఎవరనేది నేడు తేలనుంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే అత్యున్నత స్థాయి కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఈ కమిటీలో మోదీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఈ పదవికి 1982 నుంచి 1985 వరకు గల బ్యాచ్ల ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు పలువురు ఉన్నతాధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి.