సంఘ పరివార్ ఫై చంద్ర నిప్పులు.

కేంద్ర ప్రభుత్వము, సంఘ పరివార్ ఫై ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మంగళ వారం ఇక్కడ నిప్పులు చెరిగారు.విపక్ష నేత జగన్ ఫై విరుచుకు పడ్డారు.సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.అవినీతి చక్రవర్తి అయిన జగన్ ఏకంగా ప్రభుత్వ అవినీతి గురించి ప్రత్యేకంగా పుస్తకాన్ని ప్రచురించటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.గురివింద సామెతకు తిరుగులేని నిదర్శనంగా అభివర్ణించారు.దేశ ప్రయోజనాలకు విఘాతాన్ని కల్పించే కుట్రలకు సంఘ పరివార్ కేంద్రం కాగా వాటిని అమానుషంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేస్తోందని దుయ్యబట్టారు.వచ్చే ఎన్నికల్లో రెండు పక్షాలకు గుణపాఠం చెప్పేలా ప్రజల్ని చైతన్య మంతం చేయలని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos