షర్మిల ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

అమరావతి: వైఎస్ షర్మిల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని టెలికాన్ఫరెన్స్‌లో అన్నారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీనే అని విమర్శించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై మొదట్లోనే వైసీపీ దుష్ప్రచారం చేసిందని గుర్తు చేశారు. జగన్‌ కేసులపై విచారణ సాగకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. చివరికి న్యాయమూర్తులపైనా దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ పెళ్లిళ్లపై, టీడీపీ మహిళా నేతలపై, తన కుటుంబంపై అసభ్యకరంగా ప్రచారం చేశారని తెలిపారు. సోషల్‌ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos