. విద్యుత్ బిల్లు తో కలతచెందిన. రైతు…

హాథ్‌రస్: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ పరిధిలోని హుస్సేన్‌పూర్‌లో సూరజ్‌పాల్‌సింగ్ (58) అనే రైతు రూ. 6 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు అతని కోటు జేబులో సూసైడ్ నోట్ లభించింది. ఈ రైతు గ్రామం చివర సైకిల్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తుంటాడు. ప్రతీరోజులానే సాయంత్రం వేళ దుకాణానికి పడుకునేందుకు వెళ్లాడు. మర్నాడు దుకాణం వెనుకనున్న మామిడి చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో గ్రామస్తులకు కనిపించాడు. కాగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించకుండానే మృతునికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు నిర్దేశ్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి విద్యుత్ బిల్లు వచ్చినప్పటి నుంచి ఆందోళనగా ఉన్నాడని, అందుకే చావుతోనే ఈ బిల్లుకు పరిష్కారం దొరుకుతుందనేవాడని తెలిపారు. కాగా 1998లో సూరజ్‌పాల్ సింగ్ ట్యూబ్‌వెల్ కనెక్షన్ తీసుకున్నాడు. తరువాత బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖ ట్యూబ్‌వెల్ కనెక్షన్ కట్ చేసింది. అయినా రికార్డులలో విద్యుత్ బిల్లు నమోదవుతూనే ఉంది. ఈ నేపధ్యంలో సూరజ్‌పాల్‌సింగ్‌కు 2018 సెప్టెంబరులో విద్యుత్‌శాఖ నుంచి రూ. 5,71,280 మేరకు బిల్లు చెల్లించాలని నోటీసు వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos