ముంబై:అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. అనంతరం కొనుగోళ్లతో మరింత పుంజుకుని సెన్సెక్స్ 118పాయింట్ల లాభంతో 36436 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 11918 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ 10900కి ఎగువన ఉంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే. అయితే, ఫార్మా రంగం, టైర్ల షేర్లు నష్టపోతున్నాయి. మెటల్ లాభపడుతోంది. ఎస్బ్యాంకు, జీ, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్, విప్రో లాభ పడుతున్నాయి. సన్ఫార్మ, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, ఐటీసీ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.
మరోవైపు డాలరుమారకంలో రుపీ స్వల్ప బలహీనంగా ప్రారంభమైంది. గతముగింపుతో పోలిస్తే 71.06వద్ద మొదలైంది.