రాజంపేటలో అత్యధికంగా ఉన్న క్షత్రియులకు ఎమ్మెల్యే టికెట్టు కేటాయించాలని, అందులో తనకు ప్రాధాన్యతనివ్వాలని రాజు విద్యాసంస్థల చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి జగన్మోహన్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మంగళవారం అమరావతిలో సీఎంతో జగన్మోహన్రాజు భేటీ అయి వినతిపత్రం సమర్పించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో క్షత్రియులు అధికంగా ఉన్నారని, రాజంపేట ని యోజకవర్గం తరపున క్షత్రియులకు ఎమ్మెల్యే టికెట్టు కేటాయిస్తే సునాయాసంగా గెలుపొందవచ్చన్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని నగరి, పుంగనూరులలో క్షత్రియులకు టికె ట్టు ఇస్తే పార్టీ గెలుపు ఉంటుందన్నా రు. రాజంపేటలో తనకు టికెట్టు కేటాయిస్తే భారీ మెజా రిటీతో గెలుపొంది తమకు కానుకగా ఇస్తామని ఆయన తెలిపారు.