బిగ్బాస్ విజేత కౌశల్, సినీనటుడు శ్రావణ్ కుటుంబ సమేతంగా రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని ఆదివారం దర్శించుకున్నారు. మఠానికి వచ్చిన వారికి అధికారులు స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మకు హారతిచ్చారు. స్వామి బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ క్యాన్సర్తో బాధపడుతున్నవారికి, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తనకు బహుమతిగా వచ్చిన నగదు నుంచి విరాళమిచ్చానన్నారు. కౌశల్ ఆర్మీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. గతంలో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ నిర్మాణానికి విరాళమిచ్చానని, మంత్రాలయంలో మరిన్ని మంచి పనులు చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ బాధితులకు ఇళ్లు కట్టించబోతున్నామని చెప్పారు.