మోదీ లూటీకోరు:చంద్రబాబు

మోదీ లూటీకోరు:చంద్రబాబు

అమరావతి: దేశాన్నిసాక్షాత్తు ప్రధాన మంత్రే లూటీ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.. తప్పు చేస్తున్నామనే బాధ ఆయనకు ఆవగింజంతా లేదని ఆక్రోశించారు. బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. .. ఏ సమస్య పరిష్కారమైనా తెదేపా ద్వారానే సాధ్యమన్నారు.వైకాపా తాను చేసే తప్పులను తమకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీచేస్తున్న  దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని పిలుపునిచ్చారు. పేదలకు, రైతులకు తెలుగుదేశం పార్టీ చేసిన పనులే శ్రీరామరక్ష అన్నారు. విశ్వసనీయత అనేది ఒక్కరోజులో వచ్చేది కాదని, ఏళ్ల తరబడి నమ్మకంతో ప్రజల్లో ఉంటేనే అది సాధ్యమన్నారు. తెదేపా పట్ల ప్రజల్లో అత్యంత విశ్వాసం ఉందన్నారు. 5 కోట్ల ప్రజల్లో పార్టీ నిబద్ధతపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసిన పనులపై 80 శాతం సంతృప్తి ఉందని, పార్టీ పట్ల కూడా ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos