హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) భారత సైన్యం నుంచి రూ.760 కోట్ల విలువైన క్షిపణి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. భారత సైన్యంతో ఈ కాంట్రాక్టు ఒప్పందంపై దిల్లీలో బీడీఎల్ డైరెక్టర్ (ప్రొడక్షన్) వి.గురుదత్త ప్రసాద్ సంతకం చేశారు. దీని ప్రకారం బీడీఎల్ యాంటీ- ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, లాంచర్స్ భారత సైన్యానికి సరఫరా చేస్తుంది. రష్యా సాంకేతిక సహకారంతో హైదరాబాద్ సమీపంలోని భానూర్ బీడీఎల్ యూనిట్లో వీటిని తయారు చేస్తారు.