హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే నెల 25 నుంచి 27 వరకూ హైదరాబాద్లో 16వ బయోఏషియా సదస్సు జరగనుంది. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో స్టార్టప్ లను, ప్రోత్సహించడం, కొత్త ఆవిష్కరణలు మొదలైన వాటిపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు. ఔషధ, బయోటెక్, లైఫ్ సైన్సెస్ , హెల్త్కేర్, మెడికల్ టెక్నాలజీ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎస్ కుర్ట్ వాత్రిచ్, అదా యోనత్, నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ వంటి ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారు.