ప్రవాస భారతీయ దివస్ బుక్‌లెట్‌పై ఎంజే అక్బర్ ఫొటో

ప్రవాస భారతీయ దివస్ బుక్‌లెట్‌పై ఎంజే అక్బర్ ఫొటో

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ సదస్సు ప్రతినిధులకు పంపిణీ చేసిన పుస్తకాలపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ ఫొటో ముద్రించడం వివాదాస్పదమైంది. ఈ పుస్తకం మొదటి పేజీలో ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, సహాయ మంత్రి వీకేసింగ్‌తోపాటు ఎంజే అక్బర్ ఫొటో ముద్రించారు. రాజకీయ నాయకుడిగా మారిన జర్నలిస్టు ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రియా రమణితోపాటు పలువురు మహిళలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ నెలలో ఆయన విదేశాంగశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos