పేదల ‘వంటా-వార్పు’ నిరసన

పేదల ‘వంటా-వార్పు’ నిరసన

   కడప : భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్‌ ముందు పేదలు ‘ వంటా-వార్పు ‘ కార్యక్రమం ద్వారా బుధవారం నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి పేదలు భారీ ఎత్తున తరలివచ్చారు. రేపు (గురువారం) కూడా ఈ నిరసన కొనసాగనుంది. పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, భూ కబ్జాదారుల నుండి సాగు భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ వంటా-వార్పు కార్యక్రమంలో భూసాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్‌, అన్వేష్‌, రైతాంగం జిల్లా కార్యదర్శి దస్తగిరెడ్డి, సిపిఎం నగరాధ్యక్షులు రామ్మోహన్‌, వివిధ జిల్లాల పేదలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos