చిత్తూరు : చిత్తూరు జిల్లా పిఈఎస్ హాస్పిటల్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం నలగంపల్లి వద్ద ఉన్న పిఈఎస్ హాస్పిటల్లో పని చేస్తున్న హనుమంతు అనే వ్యక్తిని, అక్కడే ఇంజినీరింగ్ పని చేస్తున్న ధనుంజయ అనే వ్యక్తి స్వానర్తో కొట్టాడు. హనుమంతుకు తీవ్ర గాయాలు కావడంతో అతని బంధువులు కోపోద్రేకులయ్యారు. హనుమంతుని కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసన స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ ఘటనకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.