పాక్ యుద్ధ విమానాలు ఎఫ్-16బుధవారం
ఉదయం నియంత్రణ రేఖను దాటి భారత గగతనతలంలో ప్రవేశించి
పలు ప్రాంతాల్లో బాంబులు జారవిడిచాయి. రాజౌరీ, నౌషెరా సెక్టార్లలో పాక్ యుద్ధ విమానాల ప్రవేశం వల్ల ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ముప్పుకలిగింది. దాయాది యుద్ధవిమానాల కదలికలపై కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది.పాక్ విమానాల్ని అడ్డుకునేందుకు భారత్ యుద్ధ విమానాలు దూసుకు పోయాయి. దరిమిలా పాక్ విమానాలు తిరుగు ముఖం పట్టాయి.