పవర్ స్టార్ సరసన అఖిల్ బ్యూటీ

  • In Film
  • February 8, 2019
  • 145 Views
పవర్ స్టార్ సరసన అఖిల్ బ్యూటీ

బాలీవుడ్ అందాల నటి సైరా భాను నటవారసురాలిగా సయేషా సైగల్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ సరసన ఘనమైన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ ప్రభావం సయేషా కెరీర్ పైనా పడింది. ఆ తర్వాత సయేషా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆరంభమే చక్కని విజయం అందుకుని స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. ఆ క్రమంలోనే తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు సయేషా ప్రణాళికల్లో ఉందని సరైన అవకాశం కోసమే వేచి చూస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడ రంగంలోనూ  సయేషా దూసుకుపోతోంది. అక్కడ ఏకంగా కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ లో అవకాశం అందుకుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. సంతోష్ ఆనంద్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వ ం వహించనున్నారు. పునీత్ -సంతోష్ కలయికలో ఇదివరకూ రాజకుమార అనే ఓ భారీ హిట్ చిత్రం వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో సయేషాకు ఛాన్స్ దక్కడం చూస్తుంటే ఈ అమ్మడు అక్కడా దూసుకుపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.పునీత్ – సయేషా జంటగా నటించే ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రారంభమవుతోంది. వి.హరికృష్ణ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పునీత్ చాలా యంగ్ గా కాలేజ్ బుల్లోడిలా కనిపించనున్నాడట. అతడి ప్రేయసిగా సయేషా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుంది. ఇకపోతే సయేషాపై ఇదివరకూ రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ అమ్మడు తమిళ హీరో ఆర్యను ప్రేమిస్తోందని మార్చిలో పెళ్లాడేయబోతోందని అక్కడ ప్రచారమైంది. అయితే సయేషా – ఆర్య జంట పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos