న్యూజిలాండ్ తో తొలి వన్డే లో భారత్ ఘన విజయం

  • In Sports
  • January 23, 2019
  • 756 Views
న్యూజిలాండ్ తో తొలి వన్డే లో భారత్ ఘన విజయం

నేపియర్‌:  న్యూజిల్యాండ్ తో ఐదు వన్డేల సిరీస్ ను భారత్ ఘనంగా ప్రారంభించింది. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్ ను 38 ఓవర్లలో కేవలం 157 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ నాలుగు, చాహల్ 2, జాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్  రోహిత్ శర్మ 11 పరుగులకే బ్రేస్ వెల్ బౌలింగ్ లో గుప్తిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ, శిఖర్ ధావన్ తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను విజయం దిశగా నడిపించాడు. విజయం ముంగిట కోహ్లీ 45 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు, రాయుడితో కలిసి శిఖర్ ధావన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ధావన్ 75 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయుడు 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ కేవలం 34.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని ఛేదించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos